ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చిన శ్రీముఖి.. ఆ కంపెనీ నుంచి ఎందుకు కొన్నావ్ అంటూ నెటిజన్ల ప్రశ్న

By telugu teamFirst Published Oct 9, 2021, 8:18 PM IST
Highlights

బుల్లితెరపై దూసుకుపోతున్న క్రేజీ యాంకర్ శ్రీముఖి. అభిమానులు ఆమెని రాములమ్మగా ముద్దుగా పిలుచుకుంటారు. యాంకర్ గా, నటిగా శ్రీముఖి దూసుకుపోతోంది.

బుల్లితెరపై దూసుకుపోతున్న క్రేజీ యాంకర్ శ్రీముఖి. అభిమానులు ఆమెని రాములమ్మగా ముద్దుగా పిలుచుకుంటారు. యాంకర్ గా, నటిగా శ్రీముఖి దూసుకుపోతోంది. బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన బలమైన వాయిస్ తో టివి కార్యక్రమాలకు సందడి తీసుకువస్తుంది శ్రీముఖి. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్ గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది. రాహుల్ కు బలమైన పోటీ ఇచ్చింది. 

ఇదిలా ఉండగా Sreemukhi ఫ్యామిలీకి కూడా ప్రాధాన్యత ఇచ్చే నటి. తన కుటుంబ సభ్యులపై శ్రీముఖి ఎప్పుడూ బాధ్యతతో ఉంటుంది. తాజాగా శ్రీముఖి తన తమ్ముడు సుశ్రుత్ కి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ దృశ్యాలని శ్రీముఖి సోషల్ మీడియాలో పంచుకుంది. ఫోర్డ్ కంపెనీకి చేసిన కారుని శ్రీముఖి తన సోదరుడికి కానుకగా ఇచ్చింది. 

కారు వద్ద తన తమ్ముడితో సెల్ఫీ తీసుకుంది. కొత్తకారు కొన్న సందర్భంగా కేక్ కటింగ్, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనితో నెటిజన్లు శ్రీముఖికి, సుశ్రుత్ శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Also Read:ఘాటు అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బుల్లితెర హాట్ బాంబ్.. కుర్రాళ్ళ మనసులు గల్లంతే

కొందరు మాత్రం ఫోర్డ్ కంపెనీ కారు ఎందుకు కొన్నావు అంటూ శ్రీముఖిని ప్రశ్నిస్తున్నారు. ఫోర్డ్ సంస్థ ఇండియాలో తమ కార్యకలాపాలను, ప్రొడక్షన్ ని నిలిపివేస్తోంది. ఆ సంస్థకు చేసిన అని ప్లాంట్స్ ప్రస్తుతం అమ్మకానికి ఉంచారు. ఇండియా వదిలి వెళ్లిపోతున్న కంపెనీ కారు ఎందుకు కొన్నావు అని శ్రీముఖిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

ఇదిలా ఉండగా శ్రీముఖి చివరగా క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreemukhi (@sreemukhi)

click me!