ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'హైవే'. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలోసైకో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది.
విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆనంద్ దేవరకొండ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో రూటు మార్చి వైవిధ్యమైన కథలకు పెద్ద పీట వేస్తున్నాడు.
Anand Devarakonda ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'హైవే'. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలోసైకో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. ‘చుట్టాలబ్బాయి’ చిత్రంతో ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Also Read: వద్దని చెబుతున్నా తేజు వినడం లేదా..హెల్త్ అప్డేట్ ఇచ్చిన నాగబాబు
ఉత్కంఠ భరితమైన అంశాలతో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ పై కూర్చుని చూసేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్లో చిత్రీకరణ జరిపారు. షూటింగ్ పూర్తి కావడంతో దర్శకుడు కెవి గుహన్, ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ సింబాలిక్ గా థమ్స్ అప్ చూపిస్తూ ఫోజులు ఇచ్చారు.
చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ.. 'హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ ఇది. టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రతిక్షణం ట్విస్టులు టర్నులతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం హైవే షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో కొన్ని క్రేజీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం' అని తెలిపారు. గతంలో కెవి గుహన్..కళ్యాణ్ రామ్ తో 118 లాంటి హిట్ మూవీ తెరకెక్కించారు.