ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ ను కంప్లీట్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
వెకేషన్ అంటే ముందుగా టాలీవుడ్ నుంచి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం. ఏడాదికి ఏడెనిమిది సార్లు వెకేషన్లంటూ..విదేశాల్లో గడిపి వస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యామిలీ. మహేష్ బాబు అయితే సినిమాలు.. లేకుంటే ఫారెన్ టూర్లు.. ఈరెండు తప్పించి ఆయనకు పెద్దగా బయట తిరిగే అలవాటు లేదు. పార్టీలు, ఫంక్షన్స్ కు అసలే రారు. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు.
తాజాగా ఆయన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ లో ఉన్నారు. యూరప్ వెళ్ళిన మహేష్.. అక్కడ అందమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ తాలూకు ఫొటోలను సూపర్ స్టార్ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన అభిమానులతో పంచుకుంటున్నారు. యూరప్ ట్రిప్ కంప్లీట్ చేసిన మహేశ్ బాబు తిరిగి హోంటౌన్ హైదరాబాద్కు వచ్చేశాడన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
నా పెళ్ళి నా ఇష్టం... సీక్రెట్ వెడ్డింగ్ పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.
ఈరోజు (14 ఏప్రిల్) ఉదయం మహేష్ ఫ్యామిలీతో హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగినట్టు తెలుస్తోంది. సమ్మర్ ట్రిప్ ను కాస్త త్వరగా ముగించిన మహేష్..రాజమౌళి సినిమాకోసం రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. కొత్త సినిమా షూట్లో త్వరలోనే జాయిన్ కాబోతున్నాడట. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ త్వరలో ఓపెనింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది. వారంలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందట. ఇప్పటికే మహేష్ బాబు జక్కన్న సినిమా కోసం గట్టిగా రెడీ అయ్యాడు.
ఎస్ఎస్ఎంబీ 29కి సంబంధించి జక్కన్న ఇప్పటికే మహేశ్ బాబుకు కొన్ని లుక్ టెస్టులు చేశారని వార్తలు వచ్చాయి.ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మహేష్ బాబు లాంగ్ హెయిర్ లో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు ఈసినిమాలో. యాక్షన్ డ్రామా నేపథ్యంలో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్గా రాబోతున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్తోపాటు వరల్డ్వైడ్గా ఉన్న స్టార్ యాక్టర్లు నటించబోతున్నారని టాక్. ఈ సినిమా కోసం జక్కన్న టీం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది.