`చంద్రబాబు` ఘటనపై హీరో కళ్యాణ్‌ రామ్‌ ట్వీట్‌.. మహిళని కించపర్చడం సరికాదంటూ హెచ్చరిక

Published : Nov 20, 2021, 03:33 PM IST
`చంద్రబాబు` ఘటనపై హీరో కళ్యాణ్‌ రామ్‌ ట్వీట్‌.. మహిళని కించపర్చడం సరికాదంటూ హెచ్చరిక

సారాంశం

నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఏకంగా వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), వైసీపీ ప్రజాప్రతినిధులకు(Ycp Leaders) జరిగిన విషయం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయకుడు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఏకంగా వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్(Nandamuri Kalyan Ram) స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

`అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురు కావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా` అని kalyan Ram తెలిపారు. 

ఈ సందర్భంగా తాత ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌లను పంచుకున్నారు కళ్యాణ్‌ రామ్‌. పూజ్యులు తాతగారు రామారావుగారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామని పేర్కొన్నాడు. మరోవైపు బాలకృష్ణ మీడియా ముందు స్పందిస్తూ తన చెల్లి భువనేశ్వరిపై వ్యక్తిగత దాడి దురదృష్టకరమని తెలిపారు. వ్యక్తిగత దూషణలు సరికావని, రాజకీయాలతో సంబంధం లేని వారిపై వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే చేతులు ముడుచుకుని కూర్చోమని, బద్దలు కొట్టుకుని వస్తామని వైసీపీ నాయకులకు వార్నింగ్‌ ఇచ్చారు. 

ఇక కళ్యాణ్‌ రామ్‌ చివరగా `ఎంత మంచివాడవురా` చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మరోవైపు ఇప్పుడు ఆయన `బింబిసార` చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు కొత్తగా మరో నాలుగు సినిమాలకు కమిట్‌ అయ్యాడు కళ్యాణ్‌ రామ్‌. అవన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇకపై బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆయన సందడి చేసేందుకు రాబోతున్నారు. 

also read: Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం

also read: కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడవు, నీకు పార్టీ పగ్గాలు కావాలా?... ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన లోకేష్ ఫ్యాన్స్!
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే