ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'అరవింద'కి పెరిగిన షోలు!

By Udayavani DhuliFirst Published Oct 5, 2018, 11:05 AM IST
Highlights

మరో వారం రోజుల్లో ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా నిర్వహించాల్సివుంది కానీ చిత్రబృందం మీడియా వైపు అసలు చూడడం లేదు. 

మరో వారం రోజుల్లో ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా నిర్వహించాల్సివుంది కానీ చిత్రబృందం మీడియా వైపు అసలు చూడడం లేదు. దీని వెనుక త్రివిక్రమ్ వ్యూహం ఉందని సమాచారం.

సినిమా ప్రమోషన్స్ కోసం ఖర్చు చేయకుండా.. సినిమాపై అంచనాలు మరింతగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 'అజ్ఞాతవాసి' సినిమా విషయంలో ఇలానే అంచనాలు పెరిగిపోవడం పరిస్థితులు అనుకూలించలేదు.

కానీ 'అరవింద సమేత' విషయంలో మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అనుకుంటున్నారు. సినిమా విడుదలైన తరువాతే సినిమాను ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు. 

త్రివిక్రమ్ కి సన్నిహితులైన విలేకరులకు సైతం ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇదిఇలా ఉండగా.. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా.. బయ్యర్లు నష్టపోకుండా మొదటి వారంలోనే 70% పెట్టిన పెట్టుబడి రికవర్ అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ లోకి టికెట్ ను రూ.200కి, తెలంగాణా రాష్ట్రంలో రూ.120లకి పెంచారు.

అలానే ఆంధ్రలో రోజుకి ఆరు షోలు పడే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికే అభ్యర్ధనలు చేసినట్లు సమాచారం!

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!

click me!