అమితాబచ్చన్ ను కలిసిన డైరెక్టర్ చందూ మొండేటి, ఏం మాట్లాడుకున్నారంటే..?

By Mahesh JujjuriFirst Published Aug 19, 2022, 8:14 PM IST
Highlights

కార్తికేయ2 డైరెక్టర్ చందూ మొండేటి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు.బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ  అమితాబ్ బచ్చన్ ను కలిశారు. ఇంతకీ వీరు కలవడం వెనుక కారణం ఏంటీ..? 
 

కార్తికేయ-2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్  చందు మొండేటి.. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ని కలిశారు. ఆయనను కలిసిన పిక్ ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు దర్శకుడు. ఈ సందర్భంగా చందు మొండేటి ట్విట్టర్ లో స్పందించారు.. ఈ విధంగా రాశారు.  అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. బిగ్ బీకి ధన్యవాదాలు తెలిపారు. 

నిఖిల్, అనుమపమ పరమేశ్వరన్  హీరోహీరోయిన్లు గా చందు మొండేటి కాంబినేషన్లో వచ్చిన  సినిమా కార్తికేయ2. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఇక తెలుగుతో పాటు ఈసినిమా హిందీలో సైతం ఆడియన్స్ నుంచి ప్రశంసలు పొందింది. ఏ మాత్రం అంచనాలు, హడావుడి, సందడి లేకుండా రిలీజ్ అయిన కార్తికేయ2 సినిమా.. అనూహ్యంగా.. ఊహించనిదానికంటే ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా హిట్ కావడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

ఇక ఉత్తరాధిన ముందుగా  50 కన్నా తక్కువ స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. మంచి స్పందన వస్తుండటంతో.. ఈసినిమాను .. ప్రస్తుతం వెయ్యికి పైగా స్క్రీన్లకి పెంచారు. అన్నిరకాలుగా ఈ మూవీ సక్సెస్ సాధించడంతో.. మూవీ టీమ్ ఫుల్ జోష్ మీద ఉంది. టీమ్ అంతా పార్టీలు చేసుకుంటుంది.  ఇక ఈ సినిమాలో  బాలీవుడ్ సీనియర్ స్టార్  అనుపమ్ ఖేర్ ఇంపార్టెంట్ రోల్ లో  నటించారు. ఇక కార్తికేయ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ వ్వడంతో.. ఈ సినిమాకు మరో సీక్వెల్ గా.. కార్తికేయ 3 కూడా రాబోతున్నట్టు ఇప్పటికే దర్శకుడు  క్లారిటీ ఇచ్చారు. 


 

click me!