అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిమానం.. వారితో ఢీకి సై

By Aithagoni RajuFirst Published Mar 20, 2024, 5:36 PM IST
Highlights

అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు తెలుగులో స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు పాన్‌ ఇండియాపై కన్నేశారు. అయితే వారిపై అభిమానం చాటుకున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో. 
 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. సేమ్‌ ఇమేజ్‌, సేమ్‌ ఫాలోయింగ్‌. నెక్ట్స్ బాక్సాఫీసు వద్ద రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఈ ఏడాది సెకండాఫ్‌లో ఈ ఇద్దరు తమ సినిమాలతో సత్తా చాటబోతున్నారు. అయితే వీరికి ఎంతో మంది అభిమానులుంటారు. వారిలో స్టార్స్ ఉంటే అది ప్రత్యేకమనే చెప్పొచ్చు. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

తాజాగా వీరిపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిమానం చాటుకోవడం విశేషం. బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌.. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లపై ఆయన తన అభిమానం చాటుకున్నారు. ఈ ఇద్దరు నటులకు తాను పెద్ద అభిమానిని అని తెలిపారు. వారి వర్క్ ని ఆయన ఇష్టపడతాడట. అంతేకాదు మున్ముందు వారితో కలిసి నటించాలని ఉందని తెలిపాడు. అయితే వారితో తలపడాలని ఉందని తన మనసులో మాట వెల్లడించారు. అంటే వారి సినిమాల్లో విలన్‌ రోల్‌కి సిద్ధమే అనే విషయాన్ని ఆయన వెల్లడించారు. 

ప్రస్తుతం ఆయన `భడేమియా, చోటా మియా` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అక్షయ్‌ కుమార్‌ మరో హీరోగా నటిస్తున్నారు. దీంతోపాటు `సింఘం ఎగైన్‌`, `జగన్‌ శక్తి` సినిమాలు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఆగస్ట్ 15న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. నార్త్ మార్కెట్‌ని కొల్లగొట్టేందుకు రెడీ అవుతుంది.

మరోవైపు ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుంది. దసరాకి రాబోతుంది. దీంతోపాటు హిందీలోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్నారు ఎన్టీఆర్‌. హృతిక్‌ రోషన్‌కి ప్రత్యర్థిగా ఆయన కనిపిస్తారట. అలాగే సోలో హీరోగా మరో సినిమా చేయబోతున్నారు తారక్‌.  

Read more: ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్ లో అల్లు అర్జున్, ఎందుకొచ్చారో తెలుసా..?
 

click me!