ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిలపై మరో మూవీ "లక్ష్మీస్ వీరగ్రంథం"

Published : Oct 26, 2017, 05:45 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిలపై మరో మూవీ "లక్ష్మీస్ వీరగ్రంథం"

సారాంశం

ఎన్టీఆర్ జీవితం మరో బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ, తేజ డైరెక్షన్ లో బాలయ్య సినిమాలు మరో సినిమాగా "లక్ష్మీస్ వీరగ్రంథం" అంటున్న దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథను తెరకెక్కించడానికి ఇప్పటికే రెండు వెర్షన్లతో భారీ సినిమాలు తెరకెక్కించేందుకు కథలు సిద్ధమయ్యాయి. వీటికి తోడు తాజాగా మరో ప్రాజెక్ట్ సిద్ధమైంది. ఇప్పటికే బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో ఒకటి, దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో... రెండు చిత్రాలు తెరకెక్కడానికి సిద్ధంగా ఉండగా.. తాజాగా ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌ తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.

 

అన్న స్వర్గీయ తారకరామారావుపై ఉన్న ప్రేమ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మించ తలపెట్టానని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన వాళ్ల పాత్రలు లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో ఉంటాయన్నారు. లక్ష్మీపార్వతి తన భర్త వీరగంధం సుబ్బారావుకు రెండో భార్యగా రావడం... ఆ తర్వాత అతన్ని కూడా వదిలి సూట్‌కేసుతో బయటకు రావడం లాంటి యదార్థ సంఘటనలు లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకొన్న మరెన్నో ఆసక్తికరమైన సంఘటనలను తెరకెక్కిస్తాం అని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

 

లక్ష్మీపార్వతి పాత్రలో నటించాలని ప్రముఖ నటి వాణి విశ్వనాథ్‌ను కోరినట్లు తెలిపారు. ఆమెతో సంప్రదింపులు జరుపుతూనే ప్రముఖ తారలు లక్ష్మీరాయ్, పార్వతీ మెల్టన్‌ను కూడా సంప్రందిస్తున్నామని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. నవంబర్ నుంచి రెగ్యులర్‌గా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రానికి పేరున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తారని పేర్కొన్నారు. ఏ మాత్రం ప్రొడక్షన్ వ్యాల్యూస్ తగ్గకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తామని, ఫొటోగ్రఫీ బాధ్యతలను సుధాకర్‌రెడ్డి నిర్వర్తిస్తారని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. మరో రెండు రోజుల్లో పాటలను రికార్డింగ్ చేయనున్నామని... నవంబర్‌ రెండోవారంలో చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

 

లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తిరుపతిలో ప్రారంభిస్తామని కేతిరెడ్డి చెప్పారు. ఈ చిత్రంలో మూడు పాటలు, ఓ హరికథ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని 2018 జనవరిలో కచ్చితంగా రిలీజ్ చేయనున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. అన్న రామారావుగారి మీద అభిమానంతో మళ్లీ 10 ఏళ్ల తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నానని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రముఖ దర్శకులు పీసీరెడ్డి, విజయ నిర్మల, కృష్ణ, రాజశేఖర్, రాజేంద్రసింగ్, మోహన్ గాంధీ, జీ రామ్మోహన్‌రావు వద్ద కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పనిచేశారు.

 

సినిమాలే కాకుండా తమిళనాడులో తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఉద్యమాలు చేస్తున్నాను. తమిళనాడు తెలుగు యువశక్తి అనే సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. త్వరలోనే అమ్మ జనసేన పార్టీని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు