Pushpa: అల్లు అర్జున్‌ సర్‌ ప్రైజ్‌ ట్రీట్‌.. `పుష్ప` ట్రైలర్‌ టీజ్‌ గూస్‌బంమ్స్

By Aithagoni RajuFirst Published Dec 3, 2021, 7:33 PM IST
Highlights

`పుష్ప` సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా ఈ నెల 6న(సోమవారం) చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. అయితే అంతకంటే ముందే అభిమానుల కోసం సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా రూపొందుతున్న సినిమా `పుష్ప`(Pushpa). క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం అత్యంత క్రేజ్‌ని సొంతం చేసుకున్న సినిమా ఇది. పాన్‌ ఇండియా లెవల్‌లో దీన్ని రూపొందిస్తున్నారు. Pushpa రెండు భాగాలుగా సినిమా రిలీజ్‌ కానుంది. అందులో భాగంగా `పుష్పః ది రైజ్‌` అనే మొదటి భాగాన్ని ఈ నెల(డిసెంబర్‌) 17న విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్‌, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా ఈ నెల 6న(సోమవారం) చిత్ర ట్రైలర్‌ని Pushpa Trailer teas విడుదల చేయబోతున్నారు. అయితే అంతకంటే ముందే అభిమానుల కోసం సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ. `పుష్ప` ట్రైలర్‌కి సంబంధించిన టీజ్‌ని విడుదల చేశారు. 26సెకన్లపాటు ఉండే ఈ టీజ్‌ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ట్రైలర్‌లోని హైలైట్‌ ఎలిమెంట్లని ఈ ట్రైలర్‌లో చూపించబోతున్నట్టు ఈ ట్రైలర్‌ టీజ్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. చివర్లో అల్లు అర్జున్‌ దూకే షాట్‌ అదరగొడుతుంది. బన్నీఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. 

అదే సమయంలో ఇందులో బన్నీతోపాటు హీరోయిన్‌ రష్మిక మందన్నా, అనసూయ, సునీల్‌ ఇలా అన్ని ప్రధాన పాత్రలను చూపించారు. `పుష్ప` ట్రైలర్‌ టీజ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌ చూడాలనే ఆతృతని పెంచింది. ఇందులో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం  స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బన్నీ.. పుష్పరాజ్‌ అనే పాత్రలో ఎర్రచందనం దొంగగా కనిపించబోతున్నారని టాక్‌. 

ఎర్రచందన మాఫియా అటవి ప్రాంతంలోని పేదలను తమ స్మగ్లింగ్‌కి వాడుకుని వాళ్లని ఎలా బలి చేస్తున్నారు, వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, మాఫియాని చివరికి ఎలా ఎదిరించాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. `ఆర్య`, `ఆర్య2` చిత్రాల తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో `పుష్ప`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇందులో సమంత స్పెషల్‌ నెంబర్‌ చేస్తుంది. ప్రస్తుతం అది చిత్రీకరణ జరుపుకుంటోందట. ఇదిలా ఉంటే ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్రభాస్‌ గెస్ట్ గా రాబోతున్నట్టు సమాచారం. అదే సమయంలో హిందీలో ప్రసారమయ్యే `బిగ్‌బాస్‌ 15` షోలో బన్నీ సందడి చేయబోతున్నట్టు సమాచారం. 

also read: ప్రభాస్‌, సల్మాన్‌ ఖాన్‌లను వాడుకోబోతున్న అల్లు అర్జున్‌.. చిరంజీవి, వెంకటేష్‌లతో సల్లూభాయ్‌.. సరికొత్త గేమ్‌

click me!