44 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ... తాను అవుట్ అయిన విధానానికి డ్రెస్సింగ్ రూమ్లో అసహనం చూపిన టీమిండియా సారథి...
విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రెండేళ్లు దాటిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ కచ్ఛితంగా చూస్తామని ఆశించారు విరాట్ అభిమానులు. అయితే మొదటి నాలుగు టెస్టుల్లో విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీ మార్కు అయితే రాలేదు...
గత రెండు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న విరాట్ కోహ్లీ, నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో మంచి టచ్లో కనిపించాడు. పిచ్ బ్యాటింగ్కి చక్కగా సహకరిస్తుండడం, భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో... విరాట్ కోహ్లీ కూడా శతకం బాదేస్తాడని భావించారు క్రికెట్ ఫ్యాన్స్...
Virat Kohli, come back soon King. pic.twitter.com/ffgRH64FvH
— Neelabh (@CricNeelabh)అయితే 96 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసిన మొయిన్ ఆలీ బౌలింగ్లో స్లిప్లో క్రెగ్ ఓవర్టన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొయిన్ ఆలీ వేసిన బాల్, మరీ అంత ఆడదగనిది కాదు. అలా అవుట్ అవ్వడంపై తీవ్ర అసహనానికి గురైన విరాట్ కోహ్లీ, కోపంతో డ్రెస్సింగ్ రూమ్ డోర్ను బాదడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది...
నాలుగో రోజు టీ బ్రేక్ విరామానికి 8 వికెట్లు కోల్పోయి 445 పరుగులు చేసిన టీమిండియా, ఇంగ్లాండ్పై 346 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. కోహ్లీ అవుటైన తర్వాత శార్దూల్ ఠాకూర్ 60 పరుగులతో మెరుపు మెరిపించగా రిషబ్ పంత్ 50 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ అవుటయ్యాక ఉమేశ్ యాదవ్, బుమ్రా కూడా బౌండరీలు బాదడంతో ఆధిక్యం మరింత పెంచుకుంటోంది భారత జట్టు.