
టీమిండియా మరోసారి రికార్డు బద్దలు కొట్టింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాటర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. గతంలో ఫాస్టెస్టె సెంచరీపై ఉన్న రికార్డు మనవాళ్లు బద్దలు కొట్టారు. 2023లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పట్లో 12.2 ఓవర్లలోనే 100 పరుగులు తీసింది. ఇప్పుడే అదే రికార్డును టీమిండియా బ్యాటర్లే తిరగరాశారు. బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో 10.1 ఓవర్లలోనే 100 పరుగులు రాబట్టారు. దీంతో టెస్ట్ మ్యాచ్లలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన టీమ్గా ఇండియా చరిత్రలో చోటు సంపాదించుకుంది.