MIvsCSK: ముంబై బౌలర్ల మ్యాజిక్... మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ధోనీ సేన

Published : Sep 19, 2021, 07:50 PM ISTUpdated : Sep 19, 2021, 07:55 PM IST
MIvsCSK: ముంబై బౌలర్ల మ్యాజిక్... మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ధోనీ సేన

సారాంశం

ఫేజ్ 2ని అదిరిపోయే రేంజ్‌లో ఆరంభించిన డిఫెండింగ్ ఛాంపియన్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కేకి చుక్కలు...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2ని అదిరిపోయే రేంజ్‌లో ఆరంభించింది ముంబై ఇండియన్స్. టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోయిన రెండు వికెట్లూ, డకౌట్ కావడం మరో విశేషం...

మొదటి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న ఫాఫ్ డుప్లిసిస్, భారీ షాట్‌కి ప్రయత్నించి మిల్నేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. ఆ తర్వాత మిల్నే బౌలింగ్‌లో మొయిన్ ఆలీ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు...

మూడు బంతులు ఆడిన మొయిన్ ఆలీ షాట్‌కి ప్రయత్నించగా, సౌరబ్ తివారి కళ్లు చెదిరే క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ చేర్చాడు. 2 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై సూపర్ కింగ్స్...

ఆ తర్వాత మిల్నే బౌలింగ్‌లోనే ఆఖరి బంతిని ఎదుర్కొన్న అంబటి రాయుడు గాయంతో పెవిలియన్ చేరాడు. అంబటి రాయుడి గాయం తీవ్రమైతే, సీఎస్‌కే జట్టుపై ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది... ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి 4 పరుగులకే పెవిలియన్ చేరాడు సురేష్ రైనా. 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సీఎస్‌కే... 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే