ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ముందు రాజకీయ రగడ !

Published : Sep 14, 2025, 09:19 AM IST
IND vs PAK Asia Cup 2025 Political Tensions Fan Boycott Call

సారాంశం

IND vs PAK : ఆసియా కప్ 2025 లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ లవర్స్ కొంత మంది పాక్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని పిలుపునివ్వగా.. దీనిపై రాజకీయ రగడ మొదలైంది.

IND vs PAK : ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ లు ఆదివారం తలపడనున్నాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కోసం ఉత్కంఠకు తోడు మ్యాచ్ రాజకీయ దుమారం రేపింది. పలువురు క్రికెట్ అభిమానులు, దేశప్రజలు కొంత మంది పాకిస్తాన్ తో మ్యాచ్ ను రద్దు చేసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. పాకిస్తాన్ భారత్ పై ఉగ్రదాడుల నేపథ్యాన్ని ప్రస్తావిస్తున్నారు. 

అయితే, బహుళ జట్ల టోర్నమెంట్లలో భారతదేశం పాల్గొనడం తప్పనిసరి అని బీజేపీ, అనుబంధ పార్టీలు సమర్థించగా, శివసేన (UBT), కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ వంటి శివసేన (UBT) నాయకులు ఈ మ్యాచ్‌ను "సిగ్గుమాలిన" డబ్బు సంపాదన చర్యగా ఖండించారు. 

కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. సీనియర్ ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా, బురారీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా కూడా మ్యాచ్‌ను వ్యతిరేకించారు. కొండ్లి ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఆప్ భారత క్రికెటర్లను మ్యాచ్ బహిష్కరించాలనీ, బీసీసీఐ జట్టును ఉపసంహరించుకోవాలని కోరింది.

 

 

బీజేపీ వాదనలు ఏంటి? 

మరోవైపు, అనురాగ్ ఠాకూర్, హర్యానా క్రీడా మంత్రి గౌరవ్ గౌతమ్ వంటి బీజేపీ నాయకులు జట్టును సమర్థించారు. బహుళ జట్ల టోర్నమెంట్లలో భారతదేశం పాల్గొనడం తప్పనిసరి అని, లేకపోతే జట్టు టోర్నమెంట్ నుండి బయటకు వెళ్లిపోతుందని వారు వివరించారు. ఉగ్రవాద ముప్పు తగ్గే వరకు పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక మ్యాచ్‌లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

సెన్సిటివ్ ఇష్యూ

జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల సంఘం (JKSA) కాశ్మీరీ విద్యార్థులను జాగ్రత్తగా ఉండాలని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరింది. పహల్గాం ఉగ్రదాడి బాధితుడి తండ్రి సంజయ్ ద్వివేది మ్యాచ్‌ను వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భారత ప్రభుత్వం ఆగస్టులో తన క్రీడా విధానాన్ని సవరించి, భారత క్రీడాకారులు బహుళ జట్ల ఈవెంట్లలో పోటీ పడటానికి అనుమతించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కెప్టెన్‌గా రోహిత్.. గిల్, అయ్యర్, బుమ్రాలకు నో ప్లేస్.! 2025 బెస్ట్ వన్డే జట్టు ఇదిగో..
Hardik Pandya Girlfriend మహికా శర్మ ఒక్కనెల సంపాదన ఎంత..? ఆస్తులెన్నో తెలుసా?