పెద్ద పెద్ద మీసాలు, లైట్‌ షేవ్‌: లాక్‌డౌన్ తర్వాత కొత్త లుక్‌లో ధోనీ.. ఫొటోలు వైర‌ల్‌

By Siva KodatiFirst Published Jun 21, 2021, 3:08 PM IST
Highlights

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత ఐపీఎల్ త‌ప్ప మ‌రో టోర్నీలో ధోనీ పాల్గొనడం లేదు. ప్ర‌స్తుతం త‌న టైమంతా ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. అయితే ధోనీలాంటి స్టార్లు.. క్రికెట్ ఆడినా ఆడ‌క‌పోయినా ఏదో ఒక ర‌కంగా నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత ఐపీఎల్ త‌ప్ప మ‌రో టోర్నీలో ధోనీ పాల్గొనడం లేదు. ప్ర‌స్తుతం త‌న టైమంతా ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. అయితే ధోనీలాంటి స్టార్లు.. క్రికెట్ ఆడినా ఆడ‌క‌పోయినా ఏదో ఒక ర‌కంగా నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. పైన ఉన్న ఫొటో చూశారు క‌దా. ఈ కొత్త లుక్కే ధోనీని మ‌రోసారి వార్త‌ల్లో నిలిచేలా చేసింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత ఫ్యామిలీతో క‌లిసి షిమ్లా వెళ్లిన ధోనీ ఈ కొత్త లుక్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

పెద్ద పెద్ద మీసాల‌తో గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ధోనీ క‌నిపిస్తున్నాడు. పైగా ఆ రాష్ట్ర సాంప్ర‌దాయ టోపీ పెట్టుకొని క‌నిపించ‌డంతో ఆ ఫొటో మ‌రింత వైర‌ల్ అయింది. ప్రస్తుతం ధోనీ న్యూలుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆయన అభిమానులు రానున్న రోజుల్లో ఆ స్టైల్‌ను ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read:ICC WTC Final: ధోనీని అధిగమించిన విరాట్ కోహ్లీ... అత్యధిక టెస్టులకు సారథిగా...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 14వ ఎడిసన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేర్చాడు ధోనీ. సెప్టెంబర్‌లో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుండటంతో అందుకు తగ్గట్లుగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మే నెలలో ఐపీఎల్ 14ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

 

 

click me!