కరోనా వైరస్ కారణంగా పెరగానున్న స్మార్ట్​ఫోన్ ధరలు...

Ashok Kumar   | Asianet News
Published : Feb 17, 2020, 11:21 AM ISTUpdated : Feb 17, 2020, 09:37 PM IST
కరోనా వైరస్ కారణంగా పెరగానున్న స్మార్ట్​ఫోన్  ధరలు...

సారాంశం

కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. వచ్చే 15 రోజుల్లో భారత్​లో స్మార్ట్​ఫోన్ల ధరలు ఏడు శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గుతున్నాయి. 

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ భయాలతో చైనాలో ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దాని ప్రభావం భారత్ పైనా పడింది. చైనా దిగుమతులపై ప్రధానంగా ఆధారపడి పనిచేస్తున్న మొబైల్​ ఫోన్ల పరిశ్రమపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. వైరస్​ భయాలతో చైనాలో స్మార్ట్​ఫోన్​ విడిభాగాల పరిశ్రమలు కార్యకలాపాలు నిలిపివేయడంతో భారత్​లో వాటి లభ్యత తగ్గిపోయింది. 

తత్ఫలితంగా మరో 15 రోజుల్లో స్మార్ట్​ఫోన్లు, ఫీచర్​ ఫోన్ల విడిభాగాల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటికనుగుణంగా ఆయా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు ఫోన్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

also read ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

ఫీచర్​ఫోన్ల ధరలు 10 శాతం, స్మార్ట్​ఫోన్ల ధరలు 6-7 శాతం పెరిగే అవకాశాలున్నాయని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో 15 నుంచి 20 రోజుల్లో మార్పు కనిపించనుందని నిపుణులు అంటున్నారు.

భారత్​లో అతిపెద్ద మొబైల్​ సంస్థగా ఉన్న షియోమీ ఇప్పటికే రెడ్​మీ 8 మోడల్​ ధర పెంచేసింది. ప్రీమియం స్మార్ట్​ఫోన్ల ధరల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని విశ్లేషకులంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం దేశంలో ప్రీమియం సెగ్మెంట్​ ఫోన్ల మార్కెట్​ చాలా తక్కువగా ఉండటమే.

భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​పై ఆరు నెలల వరకు పెరిగిన ధరల ప్రభావం ఉండొచ్చని మెగ్​ఆజ్​ మొబైల్ చీఫ్​ సేల్స్ ఆఫీసర్ నిఖిల్​ చోప్రా తెలిపారు. కరోనా వైరస్ భయాలతో స్పెయిన్ బార్సిలోనాలో జరగాల్సిన వరల్డ్ మొబైల్ కాంగ్రెస్​ను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ టెలికాం పరిశ్రమ సంస్థ జీఎస్​ఎం అసోసియేషన్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.

also read మళ్ళీ తేరుచుకొనున్న ఆపిల్ ఐఫోన్ స్టోర్లు....

కరోనా వైరస్​ ప్రభావం​ ముడి చమురుపై మాత్రం ఇతర పరిశ్రమల కన్నా భిన్నంగా ఉంది. చైనా దిగుమతి చేసుకోవడం తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు ఏడాది కనిష్ఠానికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

భారత్​పై ఈ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. దేశీయ చమురు సంస్థలు ఇటీవలి పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఇంటర్నేషనల్ పత్రికలు.. సింగపూర్ సంస్థతో ఆశ్రయు మీడియా ఒప్పందం
Today Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. ఈరోజు ఎంత తగ్గిందో తెలుసా?