21 సెప్టెంబర్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Sep 21, 2018, 9:23 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తిలో ఆటంకాలు ఉంటాయి. శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటం పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన. అధికారిక ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఎవరితోనైనా వాదించాలనే ఆలోచన పెరుగుతుంది. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకుం నీరుపెట్టడం శ్రేయస్కరం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పనుల్లో ఒత్తిడి ఉంటుంది. దేవాలయాల దర్శనాలకై వెళతారు. సంతృప్తి లోపం ఉంటుంది. పనుల్లో ఆటంకాలు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆలోచన తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అనుకోని ఖర్చులు చేస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఉంటుంది. వైద్య శాలల సందర్శనం చేస్తారు. పరామర్శలు ఉంటాయి. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాల్లో అనుకూలత ఉంటుంది. పనుల్లో సహాయ సహకారాలు ఉంటాయి. సామాజిక అభివృద్ధి కొంత లోపం కనిపిస్తుంది. కాని సంతృప్తి ఉంటుంది. వ్యాపారస్తులకుం కొత్త ఆలోచనలు వస్తాయి. ఊహల్లో విహరిస్తారు. జాగ్రత్త అవసరం. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నాలు చేస్తారు. శతృవులతో జాగ్రత్త అవసరం. వెనుకదెబ్బ తీసే ఆలోచన. ఋణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభించే ఆలోచన ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతానం అనుకూల ఫలితాలిస్తారు. కొంత ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకుం అనుకూల సమయం. సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : గృహనిర్మాణాలకై ప్రయత్నం పెంచుతారు. ఇంటిలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఒత్తిడితో సమకూరుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారం సమయానికి తీసుకోవాలి. విద్యార్థులు శ్రమతో ముందుకు వస్తారు. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : స్త్రీ లద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పరీక్షల్లో ఉత్తీర్ణత. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. కొంత ఒత్తిడి ఉంటుంది. సోదరవర్గీయులతో అనుకూలతలు ఏర్పడతాయి. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాల వల్ల ఒత్తిడి అధికం. కుంటుంబంలో చికాకులు ఏర్పడతాయి. మాట విలువ తగ్గుతుంది. నిల్వ ధనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆభరణాలను పెంచుకునే ఆలోచన చేస్తారు. సంతృప్తి తగ్గుతుంది. పనుల్లో జాగ్రత్త అవసరం. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. పనుల్లో ఆటంకాలు ఉంటా యి. నిరాసక్తత ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం. మానసిక ఒత్తిడి అధికం. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. నిరంతరజపం, లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం. అనవసర ప్రయాణాలు. విహార యాత్రలపై దృష్టి. దూర ప్రయాణాలందు ఆసక్తి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పాదాల నొప్పులు. తీర్థ క్షేత్రాలకుం వెళ్ళే ఆలోచనలు పెరుగుతాయి. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీల ద్వారా ఆదాయ మార్గాలు. సమిష్టి ఆదాయం. కళాకారులకు అనుకూలం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. విహార యాత్రలపై దృష్టి అధికం. శారీరక అలసట అధికంగా ఉంటుంది. లలితాసహస్రనామ పారాయణ, పకక్షులకు నీరుపెట్టడం శ్రేయస్కరం.

డా.ఎస్ ప్రతిభ

click me!