చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: పోటీ చేసేది వీరే.....

By Nagaraju penumalaFirst Published Mar 11, 2019, 8:30 PM IST
Highlights

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. 

అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే చిత్తూరు జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 
1. పుంగనూరు – డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2. చంద్రగిరి – డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
3. తిరుపతి – భూమన కరుణాకర్ రెడ్డి
4. నగరి – ఆర్.కె.రోజా
5. చిత్తూరు – జంగాలపల్లి శ్రీనివాసులు
6. పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
7. శ్రీకాళహస్తి – బయ్యపు మధుసూదన్ రెడ్డి
8. పూతలపట్టు – ఎం.సునీల్ కుమార్
9. గంగాధర నెల్లూరు – కె. నారాయణస్వామి
10. మదనపల్లి – దేశాయి తిప్పారెడ్డి /మైనార్టీ
11. తంబళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి.
12. కుప్పం- కె. చంద్రమౌళి
13. సత్యవేడు – స్వరాజ్
 14. పలమనేరు – ఎన్.వెంకటేష్ గౌడ్  
 

ఈ వార్తలు కూడా చదవండి

అనంతపురం వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే....

కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

కర్నూలు వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: బరిలో నిలిచే అభ్యర్థులు వీరే.....

 

click me!