Campaign
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి గంగుల బ్రిజేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సభలో స్థానిక నేత ఒకరు కరెన్సీ నోట్లను జనం మీదకు వెదజల్లారు.
కర్నూల్: కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి గంగుల బ్రిజేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సభలో స్థానిక నేత ఒకరు కరెన్సీ నోట్లను జనం మీదకు వెదజల్లారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే బ్రిజేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆళ్ళగడ్డ టీడీపీ అభ్యర్ధి, మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు.
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరివెళ్లలో ఈ ఘటన బుధవారం నాడు చోటు చేసుకొంది. వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ డబ్బును తీసుకొనేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో కొందరు గాయపడినట్టుగా చెబుతున్నారు. అయితే ఎందరు గాయపడ్డారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మరో వైపు కరెన్సీ నోట్లు వెదజల్లిన విషయమై వైసీపీ అభ్యర్ధి బ్రిజేంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈసీకి కూడ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.