వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి దేవినేని ఉమా

Published : Mar 14, 2019, 09:52 AM IST
వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి దేవినేని ఉమా

సారాంశం

వైసీపీ నేత జగి రమేష్ ఇంటికి దేవినేని ఉమా ఇంటికి వెళ్లారు.  ప్రత్యర్థి ఇంటికి ఓటు అడగడానికి దేవినేని ఉమా వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

వైసీపీ నేత జగి రమేష్ ఇంటికి దేవినేని ఉమా ఇంటికి వెళ్లారు.  ప్రత్యర్థి ఇంటికి ఓటు అడగడానికి దేవినేని ఉమా వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జోగి రమేష్ తండ్రి, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ జోగి మోహన్‌రావును ఇంటింటికీ తెలుగుదేశం భాగంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయాల్సిందిగా కోరారు. 

అనంతరం పక్కనే ఉన్న  ఉన్న మాజీ ఎంపీపీ చెరుకు మాధవరావును కూడా మంత్రి ఓటు అడిగారు. పార్టీలు పక్కన పెట్టి మంత్రి ఉమా ఓ సామాన్య ఓటర్‌ను ఓటు అభ్యర్థించిన విధంగా వైసీపీ ముఖ్య నేతలైన ఆ ఇద్దరిని, అందులో తనపై 2014లో మైలవరం నుంచి వైసీపీ బరిలో నిలిచి ఓటమి చెందిన జోగి రమేష్ తండ్రిని ఓటు కలిసి అడగడం విశేషం.

PREV
click me!

Recommended Stories

ఏపీ కాబినెట్ నిర్ణయాలపై కొలుసు పార్థసారథి కీలక ప్రెస్ మీట్ | Kolusu Parthasarathy Pressmeet
తిరుమల టూ లండన్.. భక్తులు ఇచ్చిన తలనీలాలను ఏం చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.?