జగన్, కేసీఆర్ బంధం.. వేమన పద్యానికి లోకేష్ పేరడీ

By ramya NFirst Published Mar 13, 2019, 3:40 PM IST
Highlights

త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో జగన్, కేసీఆర్ లు కలసి కట్టుగా తమపై కుట్ర చేస్తున్నారని చంద్రబాబు, టీడీపీనేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో జగన్, కేసీఆర్ లు కలసి కట్టుగా తమపై కుట్ర చేస్తున్నారని చంద్రబాబు, టీడీపీనేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంలో తనకు మరో క్లూ దొరికిందందటున్నారు మంత్రి లోకేష్. బుధవారం లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది.

ఏపీ ఎన్నికల ప్రచారానికి వైసీపీ నేతలు.. టీఆర్ఎస్ వాహనాలు వాడుతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను లోకేష్ షేర్ చేశారు. అంతేకాదు.. ‘‘తెలంగాణ దొరగారి కారు...ఆంధ్రాలో జగన్ షికారు! వైకాపా కారు చూడ మేలిమై ఉండు సీటు విప్పిచూడ కారు గుర్తు ఉండు. రంగు మార్చుడెందుకు కలువకుంట జగన్ గారూ, దొరగారి ప్ర``గఢీ``భవన్ గులాబీ తోటలో పువ్వే మీరు!’’ అంటూ ఓ కవితను కూడా రాశారు.

వేమన పద్యాన్ని పేరడీ చేసి.. జగన్- కేసీఆర్ ల బంధాన్ని ఈ విధంగా తెలియజేశారు. కాగా.. ఈ ట్వీట్ కి నెటిజన్ల నుంచి రెస్పాన్స్ బాగుంది. 

తెలంగాణ దొరగారి కారు...ఆంధ్రాలో జగన్ షికారు!
వైకాపా కారు చూడ మేలిమై ఉండు
సీటు విప్పిచూడ కారు గుర్తు ఉండు.
రంగు మార్చుడెందుకు కలువకుంట జగన్ గారూ,
దొరగారి ప్ర``గఢీ``భవన్ గులాబీ తోటలో పువ్వే మీరు! pic.twitter.com/IkXApGZ5OZ

— Lokesh Nara (@naralokesh)

 

click me!