పార్టీకి నష్టం చేస్తే చర్యలు తప్పవు: మార్గాని భరత్, జక్కంపూడిలకు వైవీ వార్నింగ్

By narsimha lodeFirst Published Sep 28, 2021, 4:42 PM IST
Highlights


 రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలతో వైసీపీ ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి మూడు గంటల పాటు చర్చించారు. పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.


అమరావతి: పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైవీ సుబ్బారెడ్డి (YV subba reddy) రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (Rajahmundry MP  Margani Bharat), రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను (Rajanagaram MLA  Jakkampudi Raja)  హెచ్చరించారు.

also read:తాడేపల్లికి చేరిన వైసీపీ రాజమండ్రి వంచాయితీ: సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరిన జక్కంపూడి, మార్గాని

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి మంగళవారం నాడు ఉదయం జక్కంపూడి రాజా,  మార్గాని భరత్ లు చేరుకొన్నారు. వైసీపీ తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి ఇద్దరు నేతలతో భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు జక్కంపూడి రాజా, మార్గాని భరత్ లతో సుబ్బారెడ్డి చర్చించారు. తమ వాదనలను మార్గాని భరత్, జక్కంపూడి రాజాలతో వైవీ సుబ్బారెడ్డి మూడు గంటల పాటు చర్చించారు.

వీధిలో పడి విమర్శలు చేసుకొంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేయవద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు.ఇద్దరి మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో మరోసారి ఇవాళ సాయంత్రం భేటీ కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

 రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా  అదే స్థాయిలో కౌంటరిచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు.  పార్టీకి నష్టం చేసేలా  ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసునన్నారు. 

కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకొందని వైసీపీ నాయకత్వం గుర్తించింది. ఈ ఇద్దరి మధ్య సర్ధుబాటు చేయాలని భావించింది.వైసీపీ తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి  మార్గాని భరత్, జక్కంపూడి రాజాలకు తాడేపల్లి రావాలని ఆదేశించారు. 

click me!