ఉప రాష్ట్రపతి ఎన్నికలు : వెంకయ్య ‘‘ఎక్స్‌టెన్షన్’’ని జగన్ అడ్డుకోలేదు.. టీడీపీకి చురకలంటించిన విజయసాయిరెడ్డి

Siva Kodati |  
Published : Jul 17, 2022, 05:58 PM ISTUpdated : Jul 17, 2022, 06:02 PM IST
ఉప రాష్ట్రపతి ఎన్నికలు : వెంకయ్య ‘‘ఎక్స్‌టెన్షన్’’ని జగన్ అడ్డుకోలేదు.. టీడీపీకి చురకలంటించిన విజయసాయిరెడ్డి

సారాంశం

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోసారి అవకాశం ఇవ్వకుండా సీఎం జగన్ అడ్డుకున్నారన్న దానిపై ఆయన మండిపడ్డారు.

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు (venkaiah naidu) మరోసారి అవకాశం ఇవ్వకుండా వైసీపీ (ysrcp) అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) అడ్డుకున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) స్పందించారు. వెంకయ్యకు మరోసారి పొడిగింపు ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం బీజేపీదని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీ (telugu desam party) కొత్త పల్లవి ఎత్తుకుందంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.  మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే... ‘‘ వెంకయ్య గారికి పొడిగింపు లేదన్నది బీజేపీ నిర్ణయం. టీవి చర్చల్లో భారత ఖండంబు చీలిపోతుందని, ప్రజాస్వామ్యంకే అపాయం అని దుష్ప్రచారం. పచ్చ కుల మీడియా ఉడత ఊపులు విడ్డూరం, అసంబద్ధం. గౌరవ వెంకయ్య గారిని జగన్ గారే అడ్డుకున్నారన్న టీడీపీ కొత్త పల్లవి వాస్తవం కాదు’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

కాగా.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే అభ్యర్ధిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ ఎంపిక చేసింది. శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ఈ మేరకు జగదీప్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. సమావేశం అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధులుగా.. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, జమ్మూకాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, గవర్నర్లు ఆనందీబెన్ పటేల్, తమిళిసై సౌందరరాజన్, థావర్‌చంద్ గెహ్లాత్‌ల పేర్లు వినిపించాయి. అయితే వీరెవ్వరూ కాకుండా జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే పక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ఖరారు చేయడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Also REad:vice president election 2022 : ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్‌కర్

ఇకపోతే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇటీవల ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాన్ని ప్రకటించనున్నారు. జూలై 5 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, నామినేటేడ్ సభ్యులతో కలిపి ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం