వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ హైకోర్టులో వైఎస్ సునీతా ఇంప్లీడ్ పిటిషన్

Published : Mar 10, 2023, 11:19 AM IST
వైఎస్ వివేకా కేసులో  మరో ట్విస్ట్: తెలంగాణ హైకోర్టులో వైఎస్ సునీతా ఇంప్లీడ్  పిటిషన్

సారాంశం

మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు  తెలంగాణ హైకోర్టులో  శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు  చేశారు.  వైఎస్  అవినాష్ రెడ్డి పిటిషన్ లో తన వాదనలు కూడా వినాలని  ఆమె  ఆ పిటిషన్ లో  కోరారు. 

హైదరాబాద్: మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  మరో ట్విస్ట్  చోటు  చేసుకుంది.  కడప ఎంపీ  అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ లో   వైఎస్ సునీతారెడ్డి  ఇంప్లీడ్  పిటిషన్ ను శుక్రవారం నాడు దాఖలు  చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  గురువారంనాడు  తెలంగాణ హైకోర్టులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  పిటిషన్ దాఖలు  చేశారు. సీబీఐ విచారణ  సమయంలో  ఆడియో, వీడియో రికార్డు  చేయాలని కోరారు. అంతేకాదు  న్యాయవాది సమక్షంలో  విచారణ  జరగాలని  కోరారు.పారదర్శకంగా  విచారణ జరగడం లేదని  అవినాష్ రెడ్డి  ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు.

అయితే  కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ పై  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి  ఇంప్లీడ్  పిటిషన్ ను దాఖలు  చేశారు. అవినాష్ రెడ్డి  పిటిషన్ లో  తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు  చేసిన నేపథ్యంలో తన వాదనలను కూడా వినాలని ఆ పిటిషన్ లో  ఆమె కోరారు.
 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర యూనివర్సిటీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Deputy CM Pawan Kalya | Asianet News Telugu
Deputy CM Pawan kalyan: ఆంధ్ర యూనివర్సిటీ పవన్ పంచ్ లకి పడిపడి నవ్విన స్టూడెంట్స్ | Asianet Telugu