వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరైన నిందితులు

Published : Feb 10, 2023, 11:36 AM ISTUpdated : Feb 10, 2023, 12:32 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు: నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరైన నిందితులు

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు నిందితులను  ఇవాళ  హైద్రాబాద్ నాంపల్లిలో  గల సీబీఐ కోర్టులో హజరుపర్చారు.

హైదరాబాద్:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు నిందితులను  హైద్రాబాద్  నాంపల్లిలోని  సీబీఐ కోర్టు  శుక్రవారంనాడుహజరుపర్చారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను  హైద్రాబాద్ సీబీఐ కోర్టుకు  బదిలీ చేసింది. దీంతో  ఈ కేసు విచారణ చేస్తున్న కోర్టులో నిందితులను హజరుపర్చారు.  

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు నిందితులను  ఇవాళ  హైద్రాబాద్ నాంపల్లిలో  గల సీబీఐ కోర్టులో హజరుపర్చారు.  ఈ కేసులో  నిందితులుగా  ఉన్న  సునీల్ యాదవ్,  ఉమాశంకర్ రెడ్డి,  దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను  ప్రోటెక్షన్  వారంట్ జారీ అయింది. 

కడప జైలులో  ఉన్న నిందితులను  బందోబస్తు మధ్య ఇవాళ తెల్లవారుజామున  హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు.  ఈ కేసులో బెయిల్ పై ఉన్న  ఎర్ర గంగిరెడ్డి,  దస్తగిరిలను  కూడా   సీబీఐ అధికారులు సమన్లు  జారీ చేశారు.  

2019 మార్చి  19వ తేదీన  పులివెందులలోని తన నివాసంలో  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.   ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో విచారణ  జరిపించాలని  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ కేసు విచారణను  తెలంగాణకు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైద్రాబాద్ లో గల   ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను  కడప నుండి  ఈ ఏడాది జనవరి  24వ తేదీన తరలించారు.  

ఈ  కేసు విచారణ ఇక నుండి హైద్రాబాద్ కేంద్రంగా జరగనుంది. దీంతో  ఈ కేసులో  జైలులో ఉన్న నిందితులను కడప నుండి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. జైలులో  ఉన్న నిందితులను హైద్రాబాద్ చంచల్ గూడ జైలులో  ఉంటారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan Super Speech: మీచేతఅప్పుడే జేజేలు కొట్టించుకుంటా | Janasena Party | Asianet News Telugu
Chandra Sekhar Pemmasani About Komati Jayaram Representative for North America | Asianet News Telugu