వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐ సంచలన నిర్ణయం

Published : Oct 15, 2020, 12:01 PM ISTUpdated : Nov 02, 2020, 04:48 PM IST
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐ సంచలన నిర్ణయం

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగించారు.  

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించింది. ఐపీసీ 302 ప్రకారంగా సీబీఐ కేసును రీ రిజిస్ట్రేషన్ చేసింది.

ఈ కేసు విచారణ కోసం కొత్త సీబీఐ బృందం కడపకు రానుంది.ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

also read:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య: మరో ముగ్గురిని విచారించిన సీబీఐ

తొలుత వివేకా హత్య కేసును సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మార్పులు చేసింది. కరోనా ప్రభావంతో కొద్ది రోజులుగా కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. త్వరలోనే  స్పెషల్ టీమ్ దర్యాప్తును ప్రారంభించనుంది.
 

PREV
click me!

Recommended Stories

Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
మీ స్వస్థలంలోనే ఆఫీస్ సెటప్.. ఖర్చులు ప్రభుత్వానివే, లక్షలకు లక్షల బెనిఫిట్స్ పొందండిలా..