వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐ సంచలన నిర్ణయం

Published : Oct 15, 2020, 12:01 PM ISTUpdated : Nov 02, 2020, 04:48 PM IST
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐ సంచలన నిర్ణయం

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగించారు.  

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించింది. ఐపీసీ 302 ప్రకారంగా సీబీఐ కేసును రీ రిజిస్ట్రేషన్ చేసింది.

ఈ కేసు విచారణ కోసం కొత్త సీబీఐ బృందం కడపకు రానుంది.ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

also read:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య: మరో ముగ్గురిని విచారించిన సీబీఐ

తొలుత వివేకా హత్య కేసును సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మార్పులు చేసింది. కరోనా ప్రభావంతో కొద్ది రోజులుగా కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. త్వరలోనే  స్పెషల్ టీమ్ దర్యాప్తును ప్రారంభించనుంది.
 

PREV
click me!

Recommended Stories

స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy