మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య: మరో ముగ్గురిని విచారించిన సీబీఐ

Published : Sep 27, 2020, 04:55 PM IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య: మరో ముగ్గురిని విచారించిన సీబీఐ

సారాంశం

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో మరింత వేగాన్ని పెంచింది. ఆర్ధిక లావాదేవీల కోణంలో ఈ హత్య ఏమైనా చోటు చేసుకొందా అనే కోణంలో కూడ సీబీఐ విచారణ సాగిస్తోంది.


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో మరింత వేగాన్ని పెంచింది. ఆర్ధిక లావాదేవీల కోణంలో ఈ హత్య ఏమైనా చోటు చేసుకొందా అనే కోణంలో కూడ సీబీఐ విచారణ సాగిస్తోంది.

2019 మార్చి 15వ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోనే హత్య చేశారు. ఈ హత్య కు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు గాను సీబీఐ పలు కోణాల్లో విచారిస్తుంది.

also read:వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు: చెప్పుల షాపు యజమానిని రెండో రోజు విచారణ

కడపలోని గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు మకాం వేశారు.  ఈ కేసులో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడపకు చెందిన చెప్పుల వ్యాపారిని సీబీఐ అధికారులు ఐదు రోజుల పాటు  విచారించారు. చెప్పుల దుకాణం డీలర్లను ఇవాళ సీబీఐ అధికారులు విచారించారు.చెప్పుల వ్యాపారిని విచారించిన తర్వాత చెప్పుల డీలర్లను  ఇవాళ సీబీఐ అధికారులు విచారణకు పిలిపించారు. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సీబీఐతో విచారణ చేయించాలని వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల మేరకు ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
 

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?