ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులు: సుప్రీంలో వైఎస్ సునీతా పిటిషన్

Published : May 18, 2023, 03:07 PM IST
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులు:     సుప్రీంలో వైఎస్ సునీతా  పిటిషన్

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు నిందితుడు  ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు  షరతులపై  వైఎస్ సునీతారెడ్డి   సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు నిందితుడు  ఎర్ర గంగిరెడ్డి  బెయిల్ రద్దు షరతులను    వైఎస్ సునీతారెడ్డి  సవాల్ చేశారు. ఈ మేరకు సునీతారెడ్డి  సుప్రీంకోర్టులో  గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  వచ్చే  వారంలో  విచారణ  జరపనుంది  సుప్రీంకోర్టు వెరిఫికేషన్  బెంచ్. మరో వైపు ప్రతిదాదులకు  సుప్రీంకోర్టు  నోటీసులు  పంపింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  ఏ1 నిందితుడు  ఎర్రగంగిరెడ్డి బెయిల్ ను  ఈ ఏడాది ఏప్రిల్  27న  తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.  ఈ నెల  5వ తేదీలోపుగా  సీబీఐ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.  ఈ ఏడాది  జూన్  30వ తేదీలోపుగా  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు విచారణ ముగుస్తున్నందున  జూలై  1న  ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని  తెలంగాణ హైకోర్టు ఆదేశాలు  జారీ చేసింది.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై  వైఎస్ సునీతా రెడ్డి   సుప్రీంకోర్టును  ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన  ఆదేశాలపై  సుప్రీంకోర్టు  ఆశ్చర్యం  వ్యక్తం చేసింది. ఇవేం  ఉత్తర్వులని  సుప్రీంకోర్టు   అసహనం వ్యక్తం  చేసింది.

also read:వైఎస్ వివేకాహత్య కేసులో సీబీఐకిచ్చిన సమాచారం ఎలా లీకైంది: అజయ్ కల్లాం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో   ఎర్ర గంగిరెడ్డి  ఏ1 నిందితుడుగా  ఉన్నాడు.  గతంలో  ఈ కేసును విచారించిన  సిట్  సకాలంలో  చార్జీషీట్ దాఖలు  చేయని కారణంగా  ఎర్ర గంగిరెడ్డికి  డీఫాల్ట్ బెయిల్ ను  ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. దీంతో  ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని  కోరుతూ  సీబీఐ సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసును  తెలంగాణ  హైకోర్టుకు బదిలీ చేసినందున   ఈ  పిటిషన్ పై విచారణను  కూడా  తెలంగాణ హైకోర్టుకు  బదిలీ చేసింది  ఉన్నత న్యాయస్థానం. తెలంగాణ హైకోర్టులో  ఎర్రగంగిరెడ్డి  బెయిల్ పిటిషన్ పై  ఇరువర్గాల  వాదనలు విన్న హైకోర్టు  ఈ ఏడాది  ఏప్రిల్  27న బెయిల్ ను రద్దు  చేస్తూ  ఆదేశాలు  జారీ చేసింది. అయితే  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు విచారణ  పూర్తైన  మరునాడే  బెయిల్ ఇవ్వాలని  సీబీఐ కోర్టును  హైకోర్టు  ఆదేశించింది. ఈ షరతులపై వైఎస్ సునీతా రెడ్డి అభ్యంతరం వ్యక్తం  చేసింది. సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu