ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ కంపెనీ గురించి అంతగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు.. అదే నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ఆ ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు. అమరావతిలో పప్పుబెల్లాలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.