దారుణం: ఎలుగుబంటి దాడిలో మహిళ మృతి,ఆరుగురికి గాయాలు

Published : Jun 10, 2018, 11:45 AM IST
దారుణం: ఎలుగుబంటి దాడిలో మహిళ మృతి,ఆరుగురికి గాయాలు

సారాంశం

ఎలుగుబంటి దాడిలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం

 

శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో నిర్మల(45) అనే మహిళ మృతిచెందింది. కొబ్బరితోటలో చెత్త పారవేసుకుందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఆరుగురికి కూడా గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకుని ఎలుగుబంటిని కొట్టి చంపారు. ఎలుగుబంట్ల సంచారంతో ఎర్రముక్కాం గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర: Tirupati Gangamma Jathara Day 2 Celebrations | Asianet News Telugu
Andhra Pradesh Weather Alert: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు | Asianet News Telugu