సోషల్ మీడియాలో సింహాచలం అప్పన్న అంతరాలయం వీడియో: మండిపడుతున్న భక్తులు

Published : May 03, 2022, 05:06 PM ISTUpdated : May 03, 2022, 05:08 PM IST
 సోషల్ మీడియాలో సింహాచలం అప్పన్న అంతరాలయం వీడియో: మండిపడుతున్న భక్తులు

సారాంశం

సింహాచలం అప్పన్న అంతరాలయాన్ని కొందరు ఆకతాయిలు వీడియో తీసి షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని Simhachalam అప్పన్న ఆలయంలో అపచారం చోటు చేసుకొంది. గర్భాలయాన్ని వీడియో తీసిన ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

స్వామి అంతరాలయాన్ని వీడియో తీసి పోస్టు చేయడంపై భక్తులు బండిపడుతున్నారు. గర్భాలయంలోని నిజరూప విగ్రహాన్ని Video  తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

"

సింహాచలం Appanna ఆలయంలో భద్రత లోపాాలపై Deevotees  మండిపడుతున్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏ ఉద్దేశ్యంతో స్వామి నిజరూప  విగ్రహాన్ని సదరు ఆకతాయి తీశాడో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.అధికారుల అలసత్వం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకొందని భక్తులు ఆరోపిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu