IGZP: విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్‌లో రెండు పులులు మృతి..

Published : Jun 27, 2023, 05:01 PM IST
IGZP: విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్‌లో రెండు పులులు మృతి..

సారాంశం

Visakhapatnam: విశాఖ‌ప‌ట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (ఐజీజెడ్పీ) యానిమల్ రెస్క్యూ సెంటర్ (ఏఆర్ సీ)లో ఉన్న కుమారి (23) అనే పులి జూన్ 24 అర్థరాత్రి మృతి చెందినట్లు సోమవారం ప్రకటించింది. 2000లో జన్మించిన ఈ జంతువును 2007లో ఫేమస్ సర్కస్ నుంచి ఏఆర్ సీకి తీసుకొచ్చారు. ఏఆర్ సీ జంతువుల డాక్ట‌ర్ సమర్పించిన పోస్టుమార్టం నివేదిక ప్రకారం బహుళ అవయవాల వైఫల్యం వల్లే పులి చ‌నిపోయింద‌ని పేర్కొన్నారు.  

Indira Gandhi Zoological Park: విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో 24 గంటల వ్యవధిలో  రెండు పులులు మృతి చెందాయి. వైజాగ్ జూలో గత మూడు నెలల్లో మూడు పులులు, ఒక జీబ్రా, ఒక జిరాఫీ సహా మరణించిన జంతువుల సంఖ్య 5కు చేరింది. జానకి అనే 22 ఏళ్ల బెంగాల్ పులి వృద్ధాప్యంతో అవయవ వైఫల్యంతో మృతి చెందినట్లు విశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అదే రోజు రాత్రి మరో 23 ఏళ్ల బెంగాల్ టైగర్ కుమారి కూడా వృద్ధాప్య సమస్యతో మరణించింది.

విశాఖ‌ప‌ట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (ఐజీజెడ్పీ) యానిమల్ రెస్క్యూ సెంటర్ (ఏఆర్ సీ)లో ఉన్న కుమారి (23) అనే పులి జూన్ 24 అర్థరాత్రి మృతి చెందినట్లు సోమవారం ప్రకటించింది. 2000లో జన్మించిన ఈ జంతువును 2007లో ఫేమస్ సర్కస్ నుంచి ఏఆర్ సీకి తీసుకొచ్చారు. ఏఆర్ సీ జంతువుల డాక్ట‌ర్ సమర్పించిన పోస్టుమార్టం నివేదిక ప్రకారం బహుళ అవయవాల వైఫల్యం వల్లే పులి చ‌నిపోయింద‌ని పేర్కొన్నారు. అడవిలో పులి సగటు ఆయుర్దాయం 12-15 సంవత్సరాలు కాగా, ఏఆర్ సీ సిబ్బంది పర్యవేక్షణలో కుమారి 23 ఏళ్ల వరకు జీవించగలిగిందని జూ క్యూరేటర్ నందనీ సలారియా ఒక ప్రకటనలో తెలిపారు.

ఏఆర్ సీ (యానిమల్ రెస్క్యూ సెంటర్ )లో ఉంటున్న కుమారి అనే పులి 23న అర్థరాత్రి మృతి చెందింది. 24 ఏళ్ల జానకి పులి శనివారం ఉదయం మృతి చెందింది. కాగా, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాలలోని తెల్లపులి కుమారి మే 19న 8వ ఏట మరణించింది. కుమారి 2004లో జన్మించిందనీ, 2007లో హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి పురుష భాగస్వామితో కలిసి వైజాగ్ జూకు తీసుకొచ్చారని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (ఐజీజెడ్పీ)లో మే అనే పదేళ్ల ఆడ జిరాఫీ అనారోగ్యంతో మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు. జిరాఫీ సగటు ఆయుర్దాయం 20-25 సంవత్సరాలు. 2013లో మలేషియాలోని నెగారా జంతుప్రదర్శనశాల నుంచి మేను తీసుకొచ్చారు. మే పోస్టుమార్టం అనంతరం దాని క‌డుపులో 16 కిలోల ఇసుక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
YS Jagan Meets Vizag Steel Plant Tragedy Victims: స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా.. వైఎస్ జగన్