మినీ బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

Published : Feb 25, 2021, 10:58 AM ISTUpdated : Feb 25, 2021, 11:01 AM IST
మినీ బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

సారాంశం

అదుపుతప్పిన మినీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుడుపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలోని  గుడుపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన మినీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుడుపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది.

 స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?