కోరలు చాస్తోన్న కరోనా: ధన్వంతరి యాగం చేయనున్న టీటీడీ

Siva Kodati |  
Published : Mar 20, 2020, 04:46 PM ISTUpdated : Mar 21, 2020, 02:45 PM IST
కోరలు చాస్తోన్న కరోనా: ధన్వంతరి యాగం చేయనున్న టీటీడీ

సారాంశం

కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమలలో ధన్వంతరి యాగం చేయాలని టీటీడీ నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ యాగానికి పూజారులు, పీఠాధిపతులను మాత్రమే అనుమతించనున్నారు.

కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమలలో ధన్వంతరి యాగం చేయాలని టీటీడీ నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ యాగానికి పూజారులు, పీఠాధిపతులను మాత్రమే అనుమతించనున్నారు. లోక కళ్యాణం కోసం ఈ ధన్వంతరి యాగం చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది.

ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ధన్వంతరి యాగం నిర్వహించనున్నారు. అయితే అంతకుముందుగానే తొమ్మిది రోజుల పాటు ఆరోగ్య జపాన్ని చేయాలని అధికారులు నిర్ణయించారు.

Also Read:అమల్లోకి ఆదేశాలు, భక్తుల ప్రవేశం నిలిపివేత: తిరుమల గిరుల్లో కర్ఫ్యూ వాతావరణం

తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన రుత్విక్కులను రప్పించి, నాలుగు వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలతో ఈ జపాన్ని కొనసాగిస్తారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించిన రుత్విక్కులు ఆరోగ్య జపాన్ని ఈ నెల 25 వరకు కొనసాగించనున్నారు.

26వ తేదీన తిరుమల ధర్మగిరి వద్ద వున్న వేద పాఠశాలలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, మంత్రాలయం పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు.

ఆలయం మూసివేయడం లేదు.. భక్తుల ప్రవేశమే నిలిపివేత: టీటీడీ ఈవో

ధన్వంతరి యాగం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సుఖశాంతి, ఆరోగ్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. గతంలోనూ విపత్తుల సమయంలోనూ టీటీడీ ఇలాంటి యాగాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?