ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగిఉన్న బైక్‌లను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

Published : Feb 18, 2023, 01:33 PM IST
ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగిఉన్న బైక్‌లను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

సారాంశం

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu