ఇంటిముందు ఆడుకుంటూ.. కనిపించకుండా పోయిన 3 చిన్నారులు.. !

Published : Jun 22, 2021, 11:28 AM IST
ఇంటిముందు ఆడుకుంటూ.. కనిపించకుండా పోయిన 3 చిన్నారులు.. !

సారాంశం

కృష్ణా జిల్లాలో ఓ ఘటన కలకలం రేపింది. ఇంటిముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ఒకేసారి అదృశ్యం అవ్వడం సర్వత్రా భయాందోళనలకు కారణమయ్యింది.  

కృష్ణా జిల్లాలో ఓ ఘటన కలకలం రేపింది. ఇంటిముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ఒకేసారి అదృశ్యం అవ్వడం సర్వత్రా భయాందోళనలకు కారణమయ్యింది.

కృష్ణా జిల్లా,  ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని సగర్ల పేటకు చెందిన ముగ్గురు చిన్నారులు మాయమయ్యారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటిముందు ఆడుకుంటున్న ఖగ్గ శశాంక్ (11), ఖగ్గ చంద్రిక (9), కోట జగదీష్(8)లు కనిపించడం లేదు.

వీరు కనిపించకపోయేసరికి వారి తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ, నూజివీడు పరిసర ప్రాంతాల్లో, రహదారుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ