క్లాస్ రూంలోనే విద్యార్థినిపై అత్యాచారయత్నం... కీచక టీచర్ కు కఠిన శిక్ష

Published : May 25, 2023, 05:01 PM ISTUpdated : May 25, 2023, 05:03 PM IST
క్లాస్ రూంలోనే విద్యార్థినిపై అత్యాచారయత్నం... కీచక టీచర్ కు కఠిన శిక్ష

సారాంశం

పవిత్రమైన పాఠశాలలోనే బిడ్డలాంటి విద్యార్థినిపై అత్యచారయత్నానికి పాల్పడిన కీచక టీచర్ ను న్యాయస్థానం కఠినంగా శిక్షించింది. 

అనంతపురం : తనవద్ద చదువుకునే విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే బుద్ది తక్కువ పని చేసాడు. కూతురు వయసున్న బాలికతో పవిత్రమైన క్లాస్ రూంలో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇలా చదువు చెప్పే విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ కు తగిన శిక్ష విధించిన న్యాయస్థానం. 

వివరాల్లోకి వెళితే...  అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ స్కూళ్లో సాలవేముల బాబు ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అదే స్కూళ్ళో ఎనిమిదవ తకగతి చదివే బాలికపై అతడు కన్నేసి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక క్లాస్ రూం లో ఒంటరిగా వున్న సమయంలో ఈ కీచకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గుడి నుండి తప్పించుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. 

Read More  చాక్లెట్లు, డబ్బు ఆశచూపి.. ఏడేళ్లలో 30 మంది చిన్నారులపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవితఖైదు..

విద్యార్థిని కుటుంబసభ్యులు సాలవేముల బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసారు. అతడిపై 354(D), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపారు.ఈ ఘటనపై దిశ పోలీసులు విచారణ జరిపి ఆధారాలను అనంతపురం జిల్లా స్పెషల్ కోర్టుకు సమర్పించారు. దీంతో సాలవేముల బాబుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు