మొగతనం ఉంటే లోకేష్ ను పోటీ చేయమనండి: పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్

By telugu teamFirst Published Oct 23, 2021, 12:29 PM IST
Highlights

మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీతకు ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబునో, నారా లోకేష్ నో వచ్చి గన్నవరంలో పోటీ చేయాల్సిందిగా చెప్పాలని ఆయన సవాల్ చేశారు.

గన్నవరం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్ట (టీడీపీ) నాయకురాలు పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా ప్రతిస్పందించారు. Paritala Sunitha వ్యాఖ్యలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ము, మొగతనం ఉంటే వచ్చి నారా లోకేష్ ను గన్నవరంలో పోటీ చేయాల్సిందిగా చెప్పాలని ఆయన సవాల్ చేశారు. సాధారణ ఎన్నికల దాకా ఆగడం ఎందుకు, ఇప్పుడే తాను రాజీనామా చేస్తానని, తన వదిన పరిటాల సునీత వచ్చి గన్నవరంలో లోకేష్ నో, చంద్రబాబునో పోటీకి దించి గెలిపించుకునే ప్రయత్నం చేయాలని Vallabhaneni Vamsi అన్నారు.

పరిటాల సునీతను తాను వదినగానే భావిస్తానని ఆయన చెప్పారు. పరిటాల సునీతకు ఇప్పుడే ఎందుకు అంత కోపం వచ్చిందో తెలియదని ఆయన అన్నారు. ఆమె కృష్ణ సారథ్యం వహిస్తారో, శల్య సారథ్యం చేస్తారో చూద్దామని ఆయన అన్నారు. తన ఖాళీ లెటర్ హెడ్ మీద సంతకం చేసిన ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీ ప్రతినిధికి ఇచ్చారు. దానిపై రాజీనామా చేస్తున్నట్లు రాసి పరిటాల సునీత స్పీకర్ కు ఇవ్వాలని చెప్పారు. దమ్ముంటే Chandrababu, Nara Lokesh వచ్చి గన్నవరంలో పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. 2019లో మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి కొడాలి నానిని ఓడించలేకపోయారని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును పరిటాల సునీత చదివి వినిపించినట్లున్నారని ఆయన వ్యాఖ్యానించారు.   

Also Read: గంటసేపు కళ్లు మూసుకొంటే మేమేంటే చూపిస్తాం:పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు సాయంత్రం పడుకుంటే పొద్దున ఉన్నాడా, లేదా అని చేయి పట్టుకుని చూడాల్సిన వయస్సులో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తల్లికీ గర్భస్థ శిశువుకు మధ్య గొడవ పెట్టగలిగే సమర్థుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. గన్నవరానికో, గుడివాడకో తానూ కొడాలి నాని మొదటివాళ్లమూ కాదు, చివరి వాళ్లమూ కాదని ఆయన అన్నారు. 

టీడీపీ తరఫున గన్నవరం శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ తన విధేయతలను మార్చుకున్నారు. ఆయన సాంకేతికంగా టీడీపీలో కొనసాగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరసన చేరారు. ఆయన వైఎస్ జగన్మోనహన్ రెడ్డిని కలిసి తన విధేయతను ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన వైసీపీ కోసం పనిచేస్తున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గంట కళ్లు మూసుకుంటే తామేమిటో చూపిస్తామని పరిటాల సునీత అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చుక్కలు చూపిస్తామని అన్నారు. తమ ఒంట్లో కూడా రక్తమే ప్రవహిస్తోందని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలని ఆమె అన్నారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు మౌనంగా ఉండాలని చంద్రబాబు తమకు సూచించారని ఆమె గుర్తు చేశారు. 

Also Read: ఏపీ సీఎం జగన్ పై బూతు వ్యాఖ్యలు:రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు

click me!