స్థానిక ఎన్నికల్లో నిరాశ: ఈ నెల 12 నుండి కుప్పంలో బాబు టూర్

Published : Oct 10, 2021, 04:49 PM IST
స్థానిక ఎన్నికల్లో నిరాశ: ఈ నెల 12 నుండి కుప్పంలో బాబు టూర్

సారాంశం

 ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు  కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు.  కుప్పం నియోజకవర్గంలో బాబు టూర్ ప్రాధాన్యత నెలకొంది.

చిత్తూరు: తన స్వంత నియోజకవర్గం kuppam assembly నియోజకవర్గంలో ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు tdp చీఫ్ చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. ఈ ఎన్నికలకు టీడీపీ  దూరంగా ఉంది. అయినా కొన్ని స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేసినా ఆ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదు.  కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ycp మెజారిటీ స్థానాలను దక్కించుకొంది. దీంతో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో chandrababu naidu టూర్  ప్రాధాన్యత సంతరించుకొంది.

also read:బాబును జనం నమ్మలేదు.. కుప్పంలోనే టీడీపీ బొల్తా పడింది: పరిషత్ ఫలితాలపై సజ్జల వ్యాఖ్యలు

మూడు రోజుల పాటు చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ నెల 12న కుప్పంలో బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. అదే రోజున కుప్పం పట్టణంలో పర్యటిస్తారు. ఈ నెల 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో చంద్రబాబు  పర్యటిస్తారు. ఈ నెల 14న చంద్రబాబునాయుడు కుప్పం రూరల్ మండలంలో పర్యటిస్తారు. అదే రోజు గుడుపల్లి మండలంలో పర్యటించనున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల నుండి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ  కేంద్రీకరించింది. గత ఎన్నికల  సమయంలో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రతి రౌండ్‌లో సమీప వైసీపీ అభ్యర్ధిపై ముందంజలో నిలిచారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కుప్పం అసెంబ్లీ స్థానంలో కూడ ఆధిపత్యం సాధించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ఏపీ మంత్రి peddireddy ramachandra reddy కేంద్రీకరించి పనిచేస్తున్నారు.  


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్