దారుణం: బాత్రూమ్‌లో రైల్వే గార్డు మృతదేహం

Published : Jun 04, 2018, 06:13 PM IST
దారుణం:   బాత్రూమ్‌లో రైల్వే గార్డు మృతదేహం

సారాంశం

రైల్వేగార్డు కేవీరావు హత్య

గుంటూరు: డోన్- గుంటూరు ప్యాసింజర్ రైలులో గార్డుగా ఉన్న కేవీ రావును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి బాత్రూమ్‌లో  మృతదేహాన్ని వదిలివెళ్ళారు.గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ వద్ద బాత్రూమ్‌లను పరిశీలిస్తుండగా కేవీ రావు మృతదేహం కన్పించింది .ఈ మృతదేహాన్ని అదే రైలులో నర్సరావుపేటకు తరలించారు.


కేవీ రావు మృతదేహంపై  గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. కేవీరావు తలపై గాయాలున్నట్టు  గుర్తించారు.కేవీరావును ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు