ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Published : Jun 04, 2024, 10:14 AM IST
ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

సారాంశం

కడపలోని ప్రొద్దటూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, టీడీపీ నుంచి వరదరాజులు రెడ్డి పోటీ చేశారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో కాసేపట్లో క్లారిటీ రానుంది.  

సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ప్రొద్దుటూరు. వాణిజ్యానికి, బంగారం వ్యాపారానికి ఈ పట్టణం కేంద్రం. అక్కడక్కడా ఫ్యాక్షన్ జాడలు కనిపించినా.. మిగిలిన రోజుల్లో ప్రశాంతంగానే వుంటుంది ప్రొద్దుటూరు. డైమండ్ సిటీ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో కళంకారి ఫ్యాబ్రిక్స్ తయారవుతుంది. రాజకీయంగానూ ప్రొద్దుటూరు కీలక ప్రాంతం. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రాజుపాలెం, ప్రొద్దుటూరు మండలాలున్నాయి. 

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,730 మంది. రెడ్డి, బలిజ, ఆర్యవైశ్య, పద్మశాలి, ముస్లిం మైనారిటీలు ఇక్కడ బలంగా వున్నారు. ప్రొద్దుటూరు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ ఆరు సార్లు , టీడీపీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు విజయం సాధించాయి. అయితే స్వతంత్ర అభ్యర్ధులు ఐదు సార్లు ప్రొద్దుటూరు నుంచి గెలుపొందడం విశేషం.  

సీనియర్ నేత నంద్యాల వరదరాజులు రెడ్డి కాంగ్రెస్, టీడీపీల నుంచి వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు. 1985లో ఎంట్రీ ఇచ్చిన వరదరాజులు రెడ్డి 2004 వరకు అప్రతిహత విజయాలు సాధించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 1,07,941 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి మల్లెల లింగారెడ్డికి 64,793 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 45,148 ఓట్ల తేడాతో విజయం సాధించింది. 

ప్రొద్దుటూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024.. 

వరుసగా రెండు సార్లు గెలిచిన వైసీపీ మరోసారి ప్రొద్దుటూరులో జెండా ఎగురవేయాలని భావిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి పోటీచేశారు.  తెలుగుదేశం చివరిసారిగా 2009లో ప్రొద్దుటూరు నుంచి గెలిచింది. బీజేపీ, జనసేన మద్ధతుతో ఈసారి ఇక్కడ పాగా వేయాలని తెలుగుదేశం భావించింది. అందులో భాగంగా వరదరాజులు రెడ్డిని బరిలోకి దించింది. మరి ఈ సారి వైసీపీని టీడీపీ కొడుతుందా, విజయం ఎవరిది అనేది కాసేపట్లో తేలనుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్