అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష మరియు త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.