మహానాడులో కనిపించని ఎన్టీఆర్ కుటుంబం

Published : May 28, 2017, 08:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మహానాడులో కనిపించని ఎన్టీఆర్ కుటుంబం

సారాంశం

కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా కనిపించలేదు. మిగిలిన రెండు రోజుల్లో అయినా హాజరవుతారో లేదో చూడాలి.

మహానాడులో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఎక్కడా కనబడలేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు నందమూరి తారాక రామారావు (ఎన్టీఆర్)జయంతి రోజున ఆనవాయితీగా మహానాడు జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అటువంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ మొదటిరోజు వేదిక మీద కానీ కార్యక్రమంలో గానీ కనపించకపోవటం పెద్ద చర్చనీయాంశమైంది.  పొలిట్ బ్యూరో సభ్యునిగా హరికృష్ణ ఉన్నప్పటికీ మహానాడుకే హాజరుకాలేదు. ఇక హిందుపురం ఎంఎల్ఏ, చంద్రబాబునాయుడు బావమరిది కమ్ వియ్యంకుడు బాలకృష్ణ కూడా కనిపించలేదు. షూటింగ్ బిజిలో ఉండటంతో కార్యక్రమానికి హాజరుకాలేదని సమాచారం. ఇక మిగిలిన కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా కనిపించలేదు. మిగిలిన రెండు రోజుల్లో అయినా హాజరవుతారో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం | Asianet News Telugu
Nara Lokesh Speech: మంగళగిరి మయూరీ టెక్ పార్క్‌లో APEDB కార్యాలయం ప్రారంభం | Asianet News Telugu