రాధాకృష్ణకు కోర్టు నోటీసులు

Published : Oct 03, 2017, 04:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:42 PM IST
రాధాకృష్ణకు కోర్టు నోటీసులు

సారాంశం

కరువు, ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రిని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసారు గుర్తుందా? ఆ విషయంపై అసత్య కథనాలు రాసారంటూ వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాధాకృష్ణ తదితరులపై కేసు వేసారులేండి.

ఏబిఎన్, ఆంధ్రజ్యోతి యాజమాని వేమూరి రాధాకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో కరువు, ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రిని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసారు గుర్తుందా? ఆ విషయంపై అసత్య కథనాలు రాసారంటూ వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాధాకృష్ణ తదితరులపై కేసు వేసారులేండి. ఆ కేసు విషయమై మంగళవారం నాంపల్లి కోర్టు విచారించింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తగిన సమాధానం చెప్పటానికి వీలుగా కేసును వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అయితే, పిటీషనర్ లేవనెత్తిన అంశాలపై తగిన సమాధానం చెప్పాలంటూ రాధాకృష్ణతో పాటు మరో ఏడుగురికి కూడా కోర్టు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu