మంత్రిగా లోకేశ్ తొలి సంతకం చేశారు...

Published : Apr 07, 2017, 07:40 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
మంత్రిగా లోకేశ్ తొలి సంతకం చేశారు...

సారాంశం

గ్రామాలలో ఎల్ ఇ డి వీధి దీపాలు ఏర్పాటుచేసే కార్యక్రమం ఆంధ్రతోనే మొదలవుతూ ఉంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది.

 

 

 

పంచాయతీ  రాజ్ శాఖ మంత్రి గా నారా  లోకేశ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఒక కీలకమయిన సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన  దస్త్రం మీద తొలి సంతకం చేశారు. తర్వాత మరొక రెండు ఫైళ్ల మీద కూడా ఆయన సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు.

 

అవి :  1. ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే దస్త్రంపై  తొలి సంతకం. దీని ద్వారా రాష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

2. అనంతరం పంచాయతీరాజ్‌ ద్వారా గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ దస్త్రంపైనా ,

 3. ఆపైన గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు కార్యక్రమం ప్రారంభానికి సంబంధించిన  దస్త్రంపై ఆయన సంతకం చేశారు.

 

ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్ర  ప్రదేశే.  ఇపుడు  ఈ కార్యక్రమం నారా లోకేశ్ పర్యవేక్షణలో జరుగుతుంది.

 

ఈ సందర్భంగా లోకేశ్ గారుమాట్లాడుతూ.. గ్రామాలు, తండాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

రెండేళ్లలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu