అవనిలో మెరిసిన తెలుగు సింధూరం

Published : Aug 12, 2017, 02:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
అవనిలో మెరిసిన తెలుగు సింధూరం

సారాంశం

ఫుల్ బ్రైట్ నెహ్రూ డాక్టరల్ ఫెలోషిప్ కు ఎంపికయిన తెలుగమ్మాయి లలితా సిందూరి అమెరికాలోని బర్నార్డ్ కాలేజిలో సాంస్కృతిక నృత్యంపై పరిశోదన చేసే అవకాశం  

 
 కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ కనబర్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి విద్యార్థిని యరసూరి లలితా సిందూరి ఫుల్ బ్రైట్ నెహ్రూ డాక్టరల్ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అందించే ఈ ఫెలోషిఫ్ ను ఈ సారి దేశవ్యాప్తంగా 31 మంది ఎంపికయ్యారు. దీని లో బాగంగా 9 నెలలు అమెరికాలోని బర్నార్డ్ కాలేజిలో సాంస్కృతిక నృత్యంపై పరిశోదన చేయనున్నారు. వారిలో తెలుగు తేజం లలితా సిందూరి శాస్రీయ నృత్యం కూచీపూడి విభాగంలో ఎంపికయ్యింది.

 
దేశ వ్యాప్తంగా 800 వందలకు పైగా ప్రదర్శనలిచ్చిన లలిత అనేక అవార్డులను కైవసం చేసుకుంది.  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగ బాలాశ్రీ నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే బాలరత్న అవార్డును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. అలాంటి తెలుగుతేజం సింధు నెహ్రూ డాక్టరల్ ఫెలోషిప్ కు ఎంపికై తెలుగువారి పేరును నలుదిశల వ్యాపింపజేసింది.  

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్
RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu