కోదాడలో కృష్ణా జిల్లా వాసి అనుమానాస్పద మృతి: బంధువుల ఆందోళన, ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Aug 29, 2021, 06:40 PM IST
కోదాడలో కృష్ణా జిల్లా వాసి అనుమానాస్పద మృతి: బంధువుల ఆందోళన, ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో ఉద్రిక్తత

సారాంశం

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆదివారం  ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రామాపురం వైన్ షాప్ ముందు వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. అతనిని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటకు చెందిన  కాకనబోయిన నాగేశ్వరావుగా గుర్తించారు. 

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆదివారం  ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రామాపురం వైన్ షాప్ ముందు వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. అతనిని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటకు చెందిన  కాకనబోయిన నాగేశ్వరావుగా గుర్తించారు. అయితే వైన్ షాప్ సిబ్బందే నాగేశ్వరావును కొట్టి చంపారంటూ మృతుడి బంధువుల ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వైన్ షాప్ ముందు మృతదేహం‌తో ధర్నాకు దిగారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లాఠీఛార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu