ఘటనాస్థలిలోనే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.
కృష్ణాజిల్లా : మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. మచిలీపట్నం చింతగుంటపాలెంలో ఆక్రమణల తొలగింపు పేరుతో టీడీపీ సానుభూతిపరుల షాపులను అధికారులు తొలగిస్తున్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బాధితుల పక్షాన నిలిచారు. ఘటనాస్థలిలోనే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.
ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...అక్రమాలు తొలగిస్తే న్యాయంగా అందరివి తొలగించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఆక్రమణల పేరుతో టీడీపీ కార్యకర్తల షాపులు తొలగిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.