ఆక్రమణలపేరుతో టీడీపీ వారి కట్టడాల కూల్చివేత.. కొల్లు రవీంద్ర ఆగ్రహం (వీడియో)

By AN TeluguFirst Published Jul 10, 2021, 3:25 PM IST
Highlights

ఘటనాస్థలిలోనే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.

కృష్ణాజిల్లా : మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. మచిలీపట్నం చింతగుంటపాలెంలో ఆక్రమణల తొలగింపు పేరుతో టీడీపీ సానుభూతిపరుల షాపులను అధికారులు తొలగిస్తున్నారు. 

"

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బాధితుల పక్షాన నిలిచారు. ఘటనాస్థలిలోనే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.

ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...అక్రమాలు తొలగిస్తే న్యాయంగా అందరివి తొలగించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఆక్రమణల పేరుతో టీడీపీ కార్యకర్తల షాపులు తొలగిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!