రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకునేది చాలదా?.. క్రికెట్ కూడా ఎందుకు సామీ.. : జగన్ కు బీ.టెక్. రవి చురకలు.. (వీడియో)

Published : Jul 10, 2021, 03:00 PM IST
రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకునేది చాలదా?.. క్రికెట్ కూడా ఎందుకు సామీ.. : జగన్ కు బీ.టెక్. రవి చురకలు.. (వీడియో)

సారాంశం

రాష్ట్ర భవిష్యత్ తోనే జగన్ ఆడుకునే పరిస్థితి వుందని,  ఇవన్నీ చాలక మళ్లీ క్రికెట్ ఆడుతున్నారా స్వామీ అని చురకలు అంటించారు. 

టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీ.టెక్. రవి వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. 

"

జగన్ ... నువ్వు రాజకీయ కక్షతో ప్రత్యర్థులతో, ప్రజలతో ఆడుకుంటున్నావు. ఇవన్నీ చాలక క్రికెట్ జోలికి ఎందుకు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. 

రాజకీయ కక్షగట్టి ప్రత్యర్థులతో జగన్ ఆడుకుంటున్నారని, ప్రజలతో, నిరుద్యోగులతో, జీతాలివ్వకుండా ఉద్యోగులతో జగన్ ఆడుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీ.టెక్. రవి) విమర్శించారు. 

ఈ మేరకు శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్ర భవిష్యత్ తోనే జగన్ ఆడుకునే పరిస్థితి వుందని,  ఇవన్నీ చాలక మళ్లీ క్రికెట్ ఆడుతున్నారా స్వామీ అని చురకలు అంటించారు. టెస్టుల్లో, వన్డేల్లో భారత్ మొదటి, రెండో స్థానంలో వుందని, ఇప్పుడు దాని జోలికి ఎందకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్