టీడీపీ, జనసేనలను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Published : Oct 15, 2022, 12:40 PM ISTUpdated : Oct 15, 2022, 01:18 PM IST
 టీడీపీ, జనసేనలను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

మూడు ప్రాంతాల అభివృద్ది చెందాలన్నదే తమ లక్ష్యం అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఒకే చోట అభివృద్ది కేంద్రీకృతమైతే సమస్యలు వస్తాయని అన్నారు.

మూడు ప్రాంతాల అభివృద్ది చెందాలన్నదే తమ లక్ష్యం అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన విశాఖ గర్జన ర్యాలీ‌లో  కొడాలి నాని పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కొడాలి నాని మాట్లాడుతూ.. వర్షంలోనూ ప్రజలు వికేంద్రీకరణ ఆకాంక్షను తెలిపారని అన్నారు. చంద్రబాబు ఒక 420 అని.. పిల్లనిచ్చి, పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్‌‌ను మోసం చేశారని మండిపడ్డారు. నారా లోకేష్ కోసం.. జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు వేధిస్తున్నారని అన్నారు. 

అమరావతి రాజధానిని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించారని ఎద్దేవా చేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమం అని విమర్శించారు. ఉత్తరాంధ్రపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క అమరావతిలోనే టీడీపీ ఉందా అని ప్రశ్నించారు. ఒకే చోట అభివృద్ది కేంద్రీకృతమైతే సమస్యలు వస్తాయని అన్నారు. ఒక ప్రాంతమే అభివృద్ది చెందితే విద్వేషాలు పెరుగుతాయని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు విశాఖ పరిపాలన రాజధాని కావడంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీలను.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 టీవీలను, పేపర్లను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్  చేయాలని కోరారు. 

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటు పోవాలంటే రాజధాని రావాలని అన్నారు. విశాఖపట్నంకు రాజధాని రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. 

నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ మాట్లాడుతూ.. వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన విశాఖ గర్జన ర్యాలీని విజయవంతం చేసినందుకు కృతజ్ఞలు తెలిపారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. విశాఖపట్నంకు రాజధానిని సాధించి తీరుతామని తెలిపారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అని విమర్శించారు. ఉత్తరాంధ్ర కోసం అందరూ గొంతెత్తి నినదించాలని అన్నారు. ప్రతి ఒక్కరు మూడు రాజధానుల అవశ్యకతను వివరించాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర కోసం రాజకీయ పోరాటం చేస్తామని చెప్పారు. ఏ పోరాటానికైనా అందరూ సిద్దంగా ఉండాలని అన్నారు. 

వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం నుంచి విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన నాయకులు.. గర్జన ర్యాలీని ప్రారంభించారు. బీచ్‌ రోడ్డులోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర విశాఖ గర్జన ర్యాలీ సాగింది. అక్కడ నాయకులు వైస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. 

ఈ ర్యాలీలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు, ఉత్తరాంధ్ర వైసీపీ ప్రజాప్రతినిధులు, పలు వర్గాలకు చెందినవారు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. నగరంలో వర్షం కురుస్తున్నప్పటికీ.. విశాఖ గర్జన ర్యాలీ కొనసాగుతుంది. విశాఖ గర్జన ర్యాలీలో పాల్గొన్న వారంతా.. విశాఖకు రాజధాని రావాలంటూ నివాదాలు చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu