
H.A.N.U.M.A.N కార్యక్రమ ప్రారంభోత్సవ వేడుకలో కందుల దుర్గేష్ పాల్గొని ప్రసంగించారు. వన్యప్రాణులను సంరక్షించడం ఎంత ముఖ్యమో, అలాగే ప్రజల ప్రాణ భద్రత కూడా అంతే ప్రాధాన్యమైందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి మరియు ప్రకృతి సంరక్షణ మధ్య సమతుల్యత అవసరమని, ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా కీలకమని అన్నారు.